యంగ్ హీరో నిఖిల్ తన మనస్సు లోని మాటలను ఆవేశంగా తన ట్విట్టర్ లో పెట్టడమే కాకుండా నేడు మన దేశాన్ని శాసిస్తున్న ఒక ప్రముఖ రాజకీయ వేత్త పై బాణాలు వదిలాడు. నిన్న కాశ్మీర్ దగ్గర మన భారతదేశ సరిహద్దులలో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులలో మన దేశానికి చెందిన ఐదుగురు సైనికులు మరణించిన విషయం మన భారత జాతి యవత్తును షాక్ కు గురిచేయడమే కాకుండా నిన్న పార్లమెంట్ ను ఈ విషయం దద్దరిల్లే లా చేసింది.

ఈ విషయంపై స్పందిస్తూ హీరో నిఖిల్ చాలా ఘాటైన మాటలు తన ట్విట్టర్ లో పెట్టాడు. ‘సిగ్గుచేటు భారత ప్రభుత్వం ఏమి చేస్తోంది మన దేశాన్ని మన జీవితాలను మన భవిష్యత్ ను ఒక విదేశీరాలు నిర్దేశిస్తూ ఉంటే మన దేశం ఏమైపోతుంది?’ అంటూ తన వ్యధను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

 నేటి యంగ్ హీరోలు అంతా కోట్ల సంపాదనా కాళి దొరికితే పబ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ యంగ్ హీరో మాత్రం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై శ్రద్ద చూపించి స్పందించడం గొప్ప విషయంగానే భావించాలి. నిఖిల్ పెట్టిన ఈ ట్విట్టర్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ డి ఇండస్ట్రీ గా మారింది....

మరింత సమాచారం తెలుసుకోండి: