తెలుగు ఇండస్ట్రీలో మగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా ‘రేయ్’ హిట్ కాకపోయినా.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మరో హిట్ అయ్యింది. ఇలా వరుసగా హిట్స్ సాధించిన సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా ‘జవాన్’ సినిమా తో పరవాలేదు అనిపించుకున్నారు.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘ఇంటిలిజెంట్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. నేడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ‘ఇంటిలిజెంట్’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వినాయక్ తాజా టీజర్లో సాయి ధరమ్ తేజ్ను ధర్మాభాయ్గా పరిచయం చేశాడు.
ధర్మాన్ని.. ధర్మాభాయ్ని అంటూ వివి వినాయక్ మార్క్ కనిపించేటట్టు శత్రువుల తాట తీస్తున్నాడు సాయి ధరమ్. ఈ మూవీలో సాయి సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మించారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఇంటిలిజెంట్’ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నాజర్, రాహుల్దేవ్ తదితరులు నటించారు.