బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న దీపికా పదుకొనె ఒకప్పుడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ గా వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు అగ్ర హీరోసరసన నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు గ్లామర్ కి ప్రాధాన్యత ఇస్తూనే..మంచి నటన ఉన్న చిత్రాల్లో నటిస్తూ..దీపికా పదుకొనె తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అంతే కాదు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకోవడం కూడా మరో విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన నటీమణుల జాబితాను ఒక ప్రముఖ సంస్థ 2016 లో రూపొందించింది. ఆ జాబితాలో దీపిక టాప్ 10లో నిలిచింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పద్మావత్ చిత్రంలో తాను తన ప్రాణం పెట్టి తీశానని అందుకే ఆ పాత్ర అద్భుతంగా వచ్చిందని అన్నారు. అందుకే దర్శకుడు సినిమాలో అందరి కంటే తనకే ఎక్కువ పారితోషకం ఇచ్చాడని ఆమె తెలిపింది.
చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రణవీర్సింగ్, షహీద్ కపూర్ల కన్నా తనకే ఎక్కువ పారితోషకం ఇచ్చారని దీపిక వెల్లడించింది. అంతే కాదు దీపిక మరో సంచలనాత్మక నిర్ణయం కూడా తీసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఆమె ఓ ఈవెంట్ కు హాజరుకాగా, సన్నిహితుల మాట్లాడుతూ..తాను ఇటీవల నటించిన 'పద్మావత్' చిత్రం ఆదినుంచి వివాదాల్లోనే నడుస్తూ రావడం, వివిధ వర్గాల నుంచి తనకు ఎదురైన బెదిరింపులు తదితరాలతో ఆందోళన చెందిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, ఇకపై 'పద్మావత్' వంటి చిత్రాలను జీవితంలో చేయబోనని తెగేసి చెప్పిందట.
తన తల్లి, తండ్రి ఈ చిత్రాన్ని చూసి తనను అభినందించారని చెప్పిన దీపిక, చిత్రంలో ఖిల్జీ, రావల్ మధ్య జరిగే పోరాట దృశ్యం తనకు ఎంతో ఇష్టమైన సీన్ అని వెల్లడించింది. కాగా, గత వారంలో వెండితెరపై విడుదలైన 'పద్మావత్' నిదానంగా కలెక్షన్లను పెంచుకుంటూ వెళుతోంది.