నిన్న విడుదలైన ‘టచ్ చేసి చూడు’ పరాజయం చెందడంతో ఇప్పుడు ఆ షాక్ అల్లుఅర్జున్ అభిమానులకు తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈమూవీకి కథను సమకూర్చింది వక్కంతం వంశీ. స్వతహాగా రచయిత అయిన దర్శకుడు విక్రమ్ సిరికొండ ఒక కథను రవితేజాకు చెపితే ఆ కథను కాదని రవితేజ పట్టుపట్టి వక్కంతం వంశీ కథను సినిమాగా తీయమని దర్శకుడు విక్రమ్ సిరికొండ పై ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 ALLUARJUN LATEST PHOTOS IN   TOUCH CHESI CHUDU కోసం చిత్ర ఫలితం

అయితే ఇప్పుడు ఆ ప్రయోగం పూర్తిగా వికటించింది అని తెలుస్తోంది. గతంలో సూపర్ హిట్ మూవీలుగా పేరు తెచ్చుకున్న ‘ఇంద్ర’ ‘సమర సింహా రెడ్డి’ లాంటి ఫ్యాక్షనిస్టు కథలను తీసుకుని దాన్ని పోలీసు కథగా మార్చి వక్కంతం చేసిన ప్రయోగం ఘోరంగా విఫలం అయింది.

 ALLUARJUN IN NAAPERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో ఈ విషయాలను పసిగట్టిన అల్లుఅర్జున్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. బన్నీతో వక్కంతం దర్శకుడుగా మారి తీస్తున్న ‘నాపేరు సూర్య’ సినిమా కథ పై కూడ ఇప్పటికే కాపీ రూమర్స్ వస్తున్న నేపధ్యంలో బన్నీ విషయంలో కూడ వక్కంతం ఇటువంటి ప్రయోగాలే చేస్తున్నాడా అంటూ అభిమానులు హడలిపోతున్నట్లు టాక్.

 

ఇప్పటికే అల్లుఅర్జున్ ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ మూవీ ‘Antwone Fisher’ అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో వక్కంతం ఆ కథను కూడ రవితేజ సినిమాకోసం వ్రాసిన కథ లాగే ప్రయోగాలు చేస్తూ అల్లుఅర్జున్ పై భారీ ప్రయోగాలు చేస్తున్నాడా అన్న అనుమానాలు బన్నీ అభిమానులకు చాలగట్టిగా ఏర్పడుతున్నాయి. ఈవార్తలు ఇలా వస్తూ ఉండటంతో ఈసినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ రంగంలోకి వచ్చి ఈవార్తలు అన్నీ రూమర్లు మాత్రమే అంటూ బన్నీ అభిమానుల భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమైనా వక్కంతం పేరు చెపితే మాత్రం అల్లుఅర్జున్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: