వరస పరాజయాల తరువాత ‘రాజా ది గ్రేట్’ తో సక్సస్స్ అందుకున్న రవితేజ ఆనందం కొద్దినెలలు కూడ కొనసాగకుండానే వెనువెంటనే ఒక భయంకరమైన ఫ్లాప్ మాస్ మహారాజాను వెంటాడటం వెనుక రవితేజ మితిమీరిన ఆత్మస్థైర్యంతో చేసిన పొరపాట్లు ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తునాయి. నిన్న విడుదల అయిన ‘టచ్ చేసి చూడు’ సినిమాకు పేరుకు దర్శకత్వం వహించింది విక్రమ్ సిరికొండ అయినా ఈ సినిమాకు అన్ని విషయాలలో కర్తకర్మ క్రియగా రవితేజా వ్యహరించాడు అన్న కామెంట్స్  వినిపిస్తున్నాయి.

 RAVITEJA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి దర్శకుడు విక్రమ్ సిరికొండకు స్వేచ్ఛ ఇచ్చినట్టయితే  ఈసినిమా ఎంతోకొంత బాగా వచ్చి ఉండేది అని అంటున్నారు.   ఈమూవీ  స్టోరీలైన్ వక్కంతంది  అయినప్పటికీ దానికి మంచి స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నాడట విక్రమ్ సిరికొండ.  అయితే కొత్త  దర్శకుడితో రిస్క్ ఎందుకని రవితేజ తన పాతసినిమా ఫార్ములాని ఆధారంగా తీసుకుని ఈసినిమాను చేయమని ఒత్తిడి చేయడంతో ఈ దర్శకుడు తన స్క్రీన్ ప్లే విషయం మరిచిపోయి  అంతా రవితేజా చెప్పినట్లుగా చేసాడు అని వార్తలు వస్తున్నాయి.   

 RAVITEJA LATEST PHOTOS IN TOCH CHESI HUDU MOVIE కోసం చిత్ర ఫలితం

అయితే ఈవిషయంలో ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు మరో ప్రచారానికి తెర తీసారు.  ఈ సినిమా విషయంలో విక్రమ్ సిరికొండకు అసలు డైరక్షన్ చేతకాలేదని ఆపరిస్థితులలో విధిలేక రవితేజ దర్శకత్వంలో తల దూర్చాడు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ‘టచ్ చేసి చూడు’ సినిమా పై  భయంకరమైన నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.  

 RAVITEJA LATEST PHOTOS IN TOCH CHESI HUDU MOVIE కోసం చిత్ర ఫలితం

దీనికితోడు ఈసినిమాకు రివ్యూలు వ్రాసిన వారు దయచేసి ఈ సినిమాను ఎవరూ టచ్ చేయవద్దని కామెంట్స్ పెడుతూ ఉండటంతో కనీసం ఈ వీకెండ్ లో కూడ ఈ సినిమాకు గౌరవప్రదమైన కలెక్షన్స్ తెచ్చుకోలేని పరిస్థితుల్లోకి పడిపోయింది అని వార్తలు వస్తున్నాయి. మన  తెలుగురాష్ట్రాల్లో  సుమారు 21కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమాకు ఫైనల్ గా సగం కూడ రికవర్ కాదు అని అంటున్నారు. ఈ కామెంట్స్ చూసి రవితేజా అభిమానులే కాదు మాస్ మహారాజ కూడ నైరాశ్యంలోకి వెళ్లిపోయినట్లు టాక్.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: