ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటివిలో ఢీ ప్రోగ్రాం సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 డ్యాన్స్ షోగా రన్ అవుతుందని తెలిసిందే. ఢీ 1 నుండి ప్రస్తుతం నడుస్తున్న ఢీ 10 వరకు డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రాంలో కంటెస్టంట్స్ కు మాత్రమే కాదు డ్యాన్స్ మాస్టర్స్ కు లైఫ్ ఇస్తున్నారు.


ఢీ జోడి తర్వాత కొత్తగా ఢీ 10 స్టార్ట్ చేశారు. అయితే ఢీ జోడిలో జిత్తు ఢీ 10కి తీసుకోలేదు. అందుకు కారణాలేమో తెలియదు.. కేవలం పదవతరగతి మాత్రమే చదివిన జిత్తు డ్యాన్స్ ఒక్కటే తన ప్రాణంగా భావించి దాని మీద దృష్టి పెట్టాడు. ఏకంగా డ్యాన్స్ ట్రూప్ లో అవకాశం అందుకుని డ్యాన్సర్ గా కొనసాగుతున్నాడు.


ఇక ఈ డ్యాన్స్ మాస్టర్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కు జానికి అసిస్టెంట్ గా పనిచేశాడు. అయితే ఓ బాలీవుడ్ సినిమా టైంలో సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయగా జిత్తు వర్కింగ్ స్టైల్ నచ్చి లక్ష రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చాడట. అయితే  ఆ ఎమౌంట్ దగ్గరే జిత్తుకి జాని మాస్టర్ కు గొడవ వచ్చిందని టాక్.


కొన్ని అనుకోని సంఘటనలు మా ఇద్దరి మధ్య విభేధాలు వచ్చేలా చేశాయని. కాని ఇప్పుడు అంతా సెట్ రైట్ అయ్యిందని జిత్తు చెప్పడం జరిగింది. కొరియోగ్రాఫర్ గా జిత్తు తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. డ్యాన్స్ ను మాత్రమే నమ్ముకున్న తనకు రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయని అన్నారు జిత్తు.  



మరింత సమాచారం తెలుసుకోండి: