టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ నాగచైతన్య, సమంతలు ఇటీవలే ఒక్కటైన విషయం తెల్సిందే. చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. నాగచైతన్య .. సమంత కలిసి 'ఏమాయ చేశావే' .. 'ఆటో నగర్ సూర్య' సినిమాలు చేశారు. ఈ రెండింటిలో 'ఏ మాయ చేశావే' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాతే వీరు ప్రేమలో పడ్డారు.  మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. చైతూతో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న మారుతి, హీరోయిన్ పాత్రను సమంతతో చేయించాలని గట్టి ప్రయత్నమే చేశాడు గానీ కుదరలేదు.
Image result for chaitu samantha marriage
ప్రస్తుతం సమంత మెగా అబ్బాయి రాంచరణ్ తో ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తుంది.  అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మార్చి 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిట్టిబాబు, రామలక్ష్మి క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు.  వాస్తవానికి పెళ్లి అయిన వెంటనే వీరిద్దరు మారుతి దర్శకత్వంలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
Related image
అయితే మారుతి తన సినిమాలో సమంతను కాకుండా అను ఎమాన్యూల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమాను ప్రముఖ రచయిత కోన వెంకట్‌ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా మారి డీవీవీ దానయ్యతో కలిసి 'నిన్నుకోరి' సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది.
Related image
దాంతో ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణతోను, డీవీవీ దానయ్యతోను కలిసి మరో సినిమాను నిర్మించడానికి కోన వెంకట్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. పెళ్లి తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉంటాయనే విషయం తెల్సిందే. అందుకే కోనవెంకట్‌ కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాలని భావిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: