ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు తెరపై ప్రీమియం షో పడిన మూడు గంటల్లోనే ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.  మరీ దారుణమైన విషయం ఏంటంటే..కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకముందే ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం కావడంతో ఆ దర్శక, నిర్మాతలు లబో దిబో మంటున్నారు.  కొంత కాలంగా పైరసీని అరికట్టాలని సినీ నిర్మాతలు పెద్ద యుద్దమే చేస్తున్నారు..కానీ సైబర్ నేరగాళ్లు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తెల్లారే కొన్ని సైట్లలో ఆ సినిమాలు అప్ లోడ్ చేస్తున్నారు.
Image result for gayatri movie posters
తాజాగా పైరసీపై విలక్షన నటులు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. గాయత్రి సినిమా విషయంలో నా మనస్సు ఏడుస్తుందని బాధపడ్డారు. సినిమాను పైరసీ చేశారని.. వారి పాపానికి వాళ్లు ఈ భూమిపైనే అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు.  ఓ సినిమా తెరకెక్కించాలంటే..ఎంతో మది కష్టం దాని వెనుక దాగి ఉంటుందని..ముఖ్యంగా నిర్మాత ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎంతో ఖర్చు పెట్టి సినిమా పూర్తి చేస్తారని..అలాంటి వారికి ఈ పైరసీ ఎంతో నష్టం తీసుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Image result for gayatri movie posters
ఇటీవల వచ్చిన గాయత్రి సినిమాను పైరసీ చేశారన్నారు. ఆ దొంగలకు వార్నింగ్ ఇచ్చారు.పైరసీ అనేది నీచమైన పని అని.. తెలియని శక్తి వాళ్లను నాశనం చేస్తుందని తిట్టిపోశారు. దయచేసి ఎవరూ పైరసీని చూడొద్దని విన్నవించుకున్నారు. పైరసీ చేసినోళ్లు, చూసినోళ్లు నికృష్ఠులు అన్నారు. అలాంటి వారిని తెలియని శక్తి.. నాశనం చేస్తుందని శపించారు. ఎంతో కష్టపడి సినిమా చేశామని.. పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: