త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయం పై ఇన్నాళ్లు రకరకాల పేర్లు వినిపించాయి. త్రివిక్ర‌మ్ త‌న ప్ర‌తి సినిమాకు హీరోయిన్ల‌ను రిపీట్ చేసే అల‌వాటును కంటిన్యూ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ చివ‌రి సినిమా అజ్ఞాత‌వాసి సినిమా హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అనూతో పాటు మ‌రో ఒక‌రు ఇద్ద‌రు హీరోయిన్ల పేర్లు సైతం వినిపించినా అవేవి ఫైన‌లైజ్ కాలేదు.

Image result for trivikram ntr

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో పూజా హెగ్డేను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా తరువాత పూజ హెగ్డే  బెల్లంకొండ శ్రీనివాస్ - శ్రీవాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సాక్ష్యం సినిమాలో న‌టిస్తోంది. ఇప్ప‌టికే పూజా అంటే తెలుగు కుర్ర‌కారు ప‌డి చ‌స్తున్నారు.

Related image

ఆమెను తీసుకుంటే సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూజ‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చి రెండో వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. పిసి.వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందించ‌నున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: