త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయం పై ఇన్నాళ్లు రకరకాల పేర్లు వినిపించాయి. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాకు హీరోయిన్లను రిపీట్ చేసే అలవాటును కంటిన్యూ చేస్తుంటారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ చివరి సినిమా అజ్ఞాతవాసి సినిమా హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ను ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అనూతో పాటు మరో ఒకరు ఇద్దరు హీరోయిన్ల పేర్లు సైతం వినిపించినా అవేవి ఫైనలైజ్ కాలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా తరువాత పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ - శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే పూజా అంటే తెలుగు కుర్రకారు పడి చస్తున్నారు.
ఆమెను తీసుకుంటే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పూజను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. మార్చి రెండో వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. పిసి.వినోద్ సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు అందించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.