టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యానం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మూడు పదుల వయసులో కూడా వయసులో కూడా చెదరని అందంతో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చంద్రబింబం లాంటి అందాలన్ని ఫిదా కాని వారంటూ ఉండరు. సౌత్ లో కాజల్ అగర్వాల్ గత దశాబ్దం నుంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్వీన్ కి రీమేక్గా పారిస్ పారిస్ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎంఎల్ఏ చిత్రంలోను కాజల్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా కాజల్ కి పెద్దమ్మగా ప్రమోషన్ వచ్చింది..అదేంటా అని ఆశ్చర్యపోతున్నారా..! ఆ మద్య కాజల్ సోదరి నిషా అగర్వాల్ త్వరలో తల్లి కాబోతుందనే విషయం గతంలోనే చెప్పుకున్నాం. రీసెంట్గా నిషా ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది.
కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత నిషా అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏమైంది ఈ వేళ చిత్రం ద్వారా నిషా తెలుగు వెండి తెరకు పరిచయం అయింది. నిషా ఇంట ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. కాజల్ బాబుని ముద్దాడుతూ ఫోటోకి ఫోజిచ్చింది. అంతేకాదు ఆ ఫోటోని తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ చెల్లెలి కుమారుడి పేరు ఇషాన్ వాలేచా అని నెటిజన్స్కి పరిచయం చేసింది. నిషా అగర్వాల్, ప్రముఖ వ్యాపార వేత్త కరణ్ను 2013, డిసెంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు.