ప్రిన్స్ మహేష్ బాబుకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాపే.! దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు మహి. భరత్ అను నేను వచ్చే నెల్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఆ సినిమా తర్వాత మహేష్ ఏం చోయబోతున్నాడు..?

Image result for MAHESH AND SANDEEP VANGA

టాలీవుడ్ లో వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరొ మహేష్ బాబు. స్పైడర్ కూడా షాక్ ఇవ్వడంతో ఎలాగైనా హిట్టు కొట్టి ఆ సినిమాను జనాలు మర్చిపోయేలా చేయాలని భావిస్తున్నాడు మహేష్ . అందుకే భరత్ అను నేను సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. తొలిసారి రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంత వరకు ఓకే... మరి నెక్స్ట్ మూవీ ఎవరితో అనేదే డైలామాలో పడింది. మొదట వంశీ పైడిపల్లి పేరు వినిపించినా ఇప్పుడు సందీప్ వంగా అంటూ కామెంట్ వినిపిస్తుంది.

Image result for MAHESH BABU

ప్రిన్స్ మహేష్ కు తరువాత చేయబోయే సినిమాలు వరుస కట్టాయి. కానీ ఏ సినిమా అతను మొదలుపెడతాడో తెలియని పరిస్థితి. భరత్ అను నేను తరువాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ప్రిన్స్. దిల్ రాజు - అశ్వనీదత్ కలిసి ఆ సినిమా నిర్మాణం చేపట్టనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు. ఇలాంటి సమయంలో పీవీపీ నిర్మాత సంస్థ కోర్టుకెళ్లింది. ఆ సినిమా నిర్మించడానికి మాకే సర్వహక్కులు ఉన్నాయంటూ కోర్టుకెక్కింది. దీంతో స్క్రిప్టు కాస్త కోర్టు ఆధీనంలోకి వెళ్లిపోయింది. కోర్టు ఇచ్చే తీర్పుపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Image result for Bharat anu nenu

ఈ మ్యాటర్ ఇలా ఉంటే ఇప్పుడు మరో వార్త  హల్ చల్ చేస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాకు పనిచేయడానికి 14 మంది టెక్నీషియన్లు సిద్దమయ్యారు. కోర్టు పరిధిలో ఉన్న సినిమా కోసం ఎలా పనిచేస్తారంటూ.. వారికి కూడా కోర్టు నోటీసులు పంపించినట్టు వినిపిస్తోంది. దీంతో ఆ సినిమాను పక్కనపెట్టి సందీప్ వంగాతో ముందుకెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం. మరి అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ట్రెండ్ మార్చేసిన సందీప్ వంగా.. మహేష్ ను ఎలా చూపించబోతున్నాడో చూడాలి మరి..!


మరింత సమాచారం తెలుసుకోండి: