ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’సినిమాలో చిన్న పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ తర్వాత ఎవడే సుబ్రమాణ్యం సినిమాలో నటించాడు. హీరోగా పెళ్లిచూపులు తో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’తో టాప్ హీరోల లీస్ట్ లో చేరిపోయాడు.   సందీప్ వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా మొదట్లో ఎన్నో విమర్శల పాలైంది..అసలు ఈ సినిమా రిలజ్ చేయొద్దనే టాక్ కూడా వచ్చింది. 
Image result for devara konda vijay sai em mantram vesave
కానీ ఎన్ని విమర్శలు వచ్చినా..సినిమా రిలీజ్ చేశారు. అయితే..ఎంతగా విమర్శించారో..అంతగొప్పగా ఆదరించారు.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో విజయ్ దేవరకొండకు ఎక్కడ లేని పేరు వచ్చింది. దర్శక, నిర్మాతలు మనోడి ఇంటికి క్యూ కట్టారు.  చాలా సెలెక్టీవ్ స్టోరీలు ఎంచుకుంటూ నటిస్తానని చెప్పాడు విజయ్ దేవరకొండ.  ప్రస్తుతం మనోడు నటిస్తున్న ‘ఏ మంత్రం వేసావె’.శివానీ సింగ్ క‌థానాయిక‌. శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ ‘‘టెక్నాలజీ పరంగా అందరూ సోషల్ మీడియాకి బానిసలైపోయారు.
Image result for em mantram vesave
అలాంటి కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. కంప్యూటర్ గేమ్స్‌కు బానిసైన హీరోని.. ఆన్‌లైన్‌లో పరిచయమైన హీరోయిన్ ఎలా మార్చుకుంది. తనకు మానవ విలువలను, సంబంధాలను ఎలా తెలియజేసిందనేదే కథ అన్నారు.   అంతే కాదు ఈ  సినిమాను మార్చి 9న విడుదల చేయాలని అనుకుంటున్నాం.
Related image
నేను సినిమా చూశాను. నచ్చడంతో విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. సినిమా మంచి రికార్డులను క్రియేట్ చేసేలా.. అందరికీ నచ్చేలా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో 900-1000 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: