టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు..కానీ ఎక్కువ టైమ్ ఎవరూ నటించలేక పోయారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకూల్ ప్రీత్ సింగ్ ఇప్పటి యంగ్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. రకూల్ నటించిన సినిమాలు పాస్ , ఫెయిల్ అనే తేడా లేకుండా వరుస చాన్స్ లు తెచ్చుకుంటుంది.
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్ మొదట మోడలింగ్ చేసింది. ఈ ఫీల్డ్ నుంచి వచ్చినవారు సాధారణంగా గ్లామర్ గా కనిపిస్తారన్న విషయం తెలసిందే. ఈ మద్య ఓ మేగజిన్ కవర్ రకూల్ ప్రీత్ సింగ్ చాలా హాట్ గా ఫోటో షూట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని రోజుల నుంచి నెటిజన్లు రకూల్ పై రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్పందించిన రకూల్ మేగజీన్ల కవర్ పేజీల కోసం హీరోయిన్లు ఫొటో షూట్ చేయడం సాధారణ విషయమేనని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. అలాంటి ఫొటో షూట్లు తానొక్కదాన్నే చేయడం లేదని... అందరూ చేస్తున్న పనే అని తెలిపింది.
ప్రముఖ మేగజీన్ కవర్ పేజీలపై మెరవాలనే కోరిక తనకు కూడా ఉందని... ఇలాంటి ఫొటో షూట్లలో పాల్గొన్నందుకు తనకు కానీ, తన కుటుంబానికి కానీ లేని ఇబ్బంది... మిగతావారికి ఎందుకని అసహనం వ్యక్తం చేసింది.
తనపై అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. మితిమీరి గ్లామర్ ను ప్రదర్శించడానికి తాను కూడా వ్యతిరేకమేనని... తన హద్దులను తాను ఎన్నడూ దాటబోనని చెప్పింది.