ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్-2006 విజేత, బాలీవుడ్ నటి, వ్యాఖ్యాత నటాషా సూరీ ప్రమాదానికి గురయింది. ఇండోనేషియాలో ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి నటాషా వెళ్లింది. ఆ ఈవెంట్ పూర్తి కాగానే అడ్వంచర్ స్పాట్‌లో బంగీ జంప్ చేయడానికి వెళ్లింది. చాలా ఎత్తుపై నుంచి బంగీ జంప్ చేస్తుండగా.. నడుముకున్న త్రాడు తెగిపోవడంతో ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

నటాషాకు మామూలుగానే ప్రయాణాలన్నా, సాహాసాలన్నా విపరీతమైన క్రేజీ. అందువల్ల ఈ బంగీ జంప్‌ సాహాసం ఆమె చేసింది. ఓ సరస్సుపై ఏర్పాటు చేసిన ఈ బంగీ జంప్‌ సాహాసం చేస్తున్నప్పుడు తాడు కొద్దిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుంది.   ఐతే కింద రాళ్లురప్పలు లేకుండా నీరు మాత్రమే ఉండటం వల్ల ఆమె నేరుగా నీళ్లలో పడిందని, అందువల్ల స్వల్ప గాయాలతోనే ఆమె తప్పించుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Image result for natasha suri accident
వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారట. మరో 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. నటాషా మిస్ వరల్డ్-2006 పోటీల్లో పాల్గొని టాప్-10 లో నిలిచింది.
Image result for natasha suri accident
అనంతరం బాలీవుడ్ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఇండోనేసియాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 'ఇన్‌సైడ్ ఎడ్జ్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: