తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిన కాజల్ ఆ మద్య మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ మురిపించింది. ఒకదశలో మెగా హీరోలందరి సరసన నటించిన కాజల్ ఇప్పుడు కుర్ర హీరో సరసన నటించేందుకు సిద్దమైంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడుశీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాకున్నా రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకీ నాయక’ చిత్రంతో కాస్త పరవాలేదు అనిపించాడు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సీనియర్ నటులతో నటించిన కాజల్ మొదటి సారిగా తెలుగులో కుర్ర హీరోతో నటిస్తుంది. తొలినాళ్ళలో వర్ధమాన హీరోలతో నటించి ఆ తర్వాత స్టార్స్తో నటించే స్థాయికి చేరుకుంటారు. కానీ కాజల్ కెరీర్ దీనికి భిన్నంగా సాగుతోంది. చిరంజీవితో ఖైదీ నెంబర్ 150లో నటించిన తర్వాత ఆమె యువ హీరోల చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
కల్యాణ్రామ్తో ఎమ్మెల్యే చిత్రంలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వంశధార క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కాజల్ అని అధికారికంగా ప్రకటించారు.
రెండవ షెడ్యూల్ నుండి కాజల్ షూటింగ్లో పాల్గొంటారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి, చోటా కె.నాయుడు, తమన్, చోటా కె.ప్రసాద్, స్టన్ శివ సాంకేతిక సహకారం అందిస్తున్నారు. నిర్మాత నవీన్ శొంటినేని, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం శ్రీనివాస్. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.