ఫేమస్ అవ్వాలంటే కొందరు తమ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తారు, మరికొందరు వివాదాలను సృష్టిస్తారు. అయితే హీరోయిన్లు ఇందుకు భిన్నం సోషల్ మీడియా వేదికగా తమ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అలాకాని పక్షంలో కొందరు సంచలన వాఖ్యలు చేస్తారు. గత కొన్ని రోజులుగా నటి శ్రీ రెడ్డి ఇంటర్నెట్లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పి సంచలనం సృష్టించింది.


ఇక అప్పటి నుండి వార్త ఛానెళ్లలో ఈమెకు డిమాండ్ పెరిగిపోయింది. ఈమె ఇంటర్వ్యూ కోసం వార్తా ఛానెళ్లు ఎగబడుతున్నాయి. మొన్న తనతో క్లోజ్ గా ఉన్న ఒక నిర్మాత కొడుకు ఫోటోను పేస్ బుక్ లో పోస్ట్ చేసి బాంబు పేల్చిన ఈ భామ తాజాగా మళ్ళీ సంచలనాన్ని నమోదుచేసింది. ఈటీవీ ఛానల్ లో వచ్చే ప్రోగ్రామ్స్ కు డైరెక్టరుగా వ్యవహరిస్తున్న అనిల్ కడియాల ఒక బోకు అంటూ తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసుకొచ్చింది.


"ఇంకొక మహారాజశ్రీ బోకుగాడు. ఈటీవీలో అలీ గారు చేస్తున్న ప్రోగ్రాములకు డైరక్టరుగా చేస్తుంటాడు. నేను చెప్తున్నదానికి అలీ గారికి ఎటువంటి సంబంధం లేదు. ప్రోగ్రామ్ కు వచ్చే అమ్మాయిల్ని, యాంకర్ గా ట్రై చేసే  అమ్మాయిల్ని వాడు దారుణంగా మోసం చేశాడు. వీడు చేసే పనులకు భార్య కూడా సపోర్టు. ఆవిడ గారు ఒక గ్రేట్ యాంకర్, బిజినెస్ రాణి " అంటూ రాసుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: