మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ చిత్రం తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు.  డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ ఇలా అన్నింటిలోనూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు.  సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దువ్వాడ జగన్నాధం లాంటి కమర్షియల్ హిట్ సినిమాలో నటించి మరో విజయం అందుకున్నాడు. 
Image result for vedam movie
ప్రస్తుతం నా పేరు సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపుతో కలిసి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు క్రిష్. ఆయన చిత్రాలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి.
Image result for naa peru surya
క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా మణికర్ణిక చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గతంలో వేదం చిత్రం కోసం క్రిష్ దర్శకత్వంలో నటించారు. ఆ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చినా కమర్షియల్ గా రాణించ లేకపోయింది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, క్రిష్ తో సినిమా చేసే అవకాశలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తన్నాయి. 

అంతే కాదు ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసిన క్రిష్ .. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడు. కథా పరంగా .. పాత్ర పరంగా ఇది బన్నీకి సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. త్వరలోనే బన్నీని కలిసి కథ చెప్పనున్నాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: