తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘అజ్ఞాతవాసి’ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక పోయింది..మొదటి నుంచి ఎన్నో అంచనాలు వేసుకున్నా..బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ సాధించాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది. గత ఏడాది అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ ముహుర్తానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాన్ వచ్చారు. రెగ్యులర్ షూటింగ్కు మాత్రం ఆరు నెలల సమయం తీసుకున్నారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ కసరత్తు చేశారు. బరువు తగ్గారు. కొత్తలుక్తో కనిపిస్తున్నారు.
త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ను అందించారు... తారక్ని కూడా కొత్త అవతారంలో చూడబోతున్నాం... అతడి న్యూ లుక్తో మీరంతా ఆశ్చర్యపోవడం ఖాయమంటూ పీఆర్వో మహేష్ కోనేరు ట్వీట్ చేశారు. అలాగే ఈ నెల 13 నుంచి 25 వరకు హైదరాబాద్లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరగబోతోందట.
హారికా, హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు.. ఈ స్టిల్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.. ఈ స్టిల్లో ఎన్టీఆర్ కొత్త లుక్ లో స్మార్ట్ గా కనిపిస్తున్నారు.. మీరూ ఆ స్టిల్ ను చూడండి..