టాలీవుడ్ ఇండస్ట్రీలో కథా రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ లాంటి మరో మెసేజ్ సినిమాతో మరో విజయం అందుకున్నారు. ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న కొరటాల మరోసారి మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కిస్తున్నారు.
శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను. ఈ చిత్రం ఈ నెల 20వ తేదిన విడుదల కానుంది. సూపర్స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉండబోతోందన్నది అర్థమవుతోంది.
ఇక ఈ మూవీలోని ఓ వసుమతి సాంగ్ వీడియో ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది చిత్ర యూనిట్..యాజిన్ నిజార్, రీటాలు ఆలపించిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ సినిమాకు దేవీశ్రీ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
సూపర్స్టార్ మహేష్, కైరా అద్వాని, ప్రకాష్రాజ్, శరత్కుమార్లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు, ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ