మాయలేడి సమంత పై పంజాబీ బ్యూటీ ఛార్మి సెటైర్ లు వేస్తోంది. సామాన్యంగా రోడ్డు పై షూటింగులు జరుగుతున్నప్పుడు జనం ఎగబడుతూ ఉంటారు. సమంత లాంటి క్యూట్ హీరోయిన్ రోడ్డు మీద నిలబడితే ఎవరికైనా ఆకర్షణ ఎక్కువగానే ఉంటుంది. సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబందించిన కొన్ని సన్నీ వేసాలను రోడ్డు మీద చిత్రీకరిస్తున్నారట ఫిలిం యూనిట్ వారు. దానితో షరామామూలుగానే సమంత చుట్టూ జనం గుమిగూడరట.

 దీనితో కోపం వచ్చిన మన చెన్నై బ్యూటి తనను జూలో జంతువును చూసినట్లుగా విచిత్రంగా చూస్తున్నారని తనకు షూటింగ్ స్పాట్ లో ఉన్నాన జూలో ఉన్నాన అనే ఫీలింగ్ కలుగుతోందని తన ట్విటర్ ఆయుధంలో ఒక ట్విట్ పెట్టింది సమంత. దీనిపై ఎందుకు కోపం వచ్చిందో తెలియదుగానీ ఛార్మీ సమంతను తన ట్విటర్ లో టార్గెట్ చేసింది.

అందరూ అలా గుమిగూడిన ప్రదేశాలలో నటించగలిగినందుకే మనకు అంత భారీ పారితోషికాలు ఇస్తున్నారు అంటూ, తాను ప్రస్తుతం నటిస్తున్న షూటింగ్ స్పాట్ లో తన పర్సనల్ మేకప్ కిట్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదని అంటూ మనకు హారతులు పడుతున్న సామాన్య ప్రజలను కించపరచకూడదని తన ట్విటర్ లో సమంతకు క్లాస్ తీసుకుంది ఛార్మీ. ఇంతకీ సమంత పై చార్మీకి ఎందుకంత కోపమో వారిద్దరికే తెలియాలి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: