‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ తో మరో ఘన విజయం సాధించారు.  ఈ సినిమా రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ తెచ్చుకునే వరకు మహేష్ బాబు ఎంతో టెన్షన్ పడ్డారట.  అంతకు ముందు ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత తన కెరీర్ అగమ్య గోచరంలో పడటంతో మరోసారి కొరటాల శివనే నమ్ముకుని ‘భరత్ అనే నేను’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.  ఈ సినిమా విజయాన్ని మహేష్ కుటుంబంతో పాటు చిత్ర యూనిట్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  సినిమా విడుదలైన నాటి నుంచి ప్రమోషన్ వర్క్స్ చేస్తూ అలసిపోయానని, ఈ సినిమా చాలా సంతృప్తి ఇచ్చిందని ఆయన తెలిపారు.
Image result for bharat ane nenu stills
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘భరత్ అనే నేను బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌’లో మహేశ్ మాట్లాడారు. కొరటాల శివ అమేజింగ్ డైరెక్టర్ అని, ఆయన అద్భుతంగా కథ చెబుతారని మహేశ్ కొనియాడారు. సినిమాలతో పాటు కొరటాలకు చాలా విషయాలు తెలుసని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ పాట షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ‘వచ్చాడయ్యో సామీ పాట షూటింగ్‌ రిహార్సల్ చేస్తున్నాం.. అందులో దండం పెట్టే సీన్ ఉంది.
Image result for bharat ane nenu stills
నేను మామూలుగా దండం పెట్టా.. అప్పుడు కొరటాల వచ్చి.. దండం గుండెలపైన ఉండాలండీ.. అని చెప్పారు.. ఇలాంటివి ఆయనకు చాలా తెలుసు.. కొరటాల.. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి..’ అని మహేశ్ అన్నారు.నాన్నగారి అభిమానులు, నా అభిమానులు నన్ను సూపర్ స్టార్ అంటుంటారు. అలాంటి సూపర్ స్టార్‌కు నాలుగేళ్లలో రెండు హిట్లు ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు.. ఆయన తీసిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్స్.. అలాంటి డైరెక్టర్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని మహేశ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: