తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటి వరకు ఎన్నో సంచలన ఆరోపణలు చేసి ప్రకంపణలు సృష్టించిన నటి శ్రీరెడ్డి ఆ మద్య అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో విషయం కాస్త నేషనల్ స్థాయికి చేరుకుంది.  దాంతో ఆమెకు మహిళా సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు మద్దతు పలికారు.  ఇక తాను చేస్తున్న పోరాటానికి మరింత బలం వచ్చిందని భావించిన శ్రీరెడ్డి నోటికి అదుపు లేకుండా పోవడం..ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి చిట్టాలు విప్పుతానని హెచ్చరికలు చేయడం..కొంత మంది తనతో తీయించుకున్న ఫోటోలు ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ ఫోటోలు లీక్ చేయడంతో విషయం మరింత సీరియస్ అయ్యింది.
Image result for sri reddy teja
ఇదే క్రమంలో తనకు కొంత మద్దతు లభిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.  ఒక్కసారే ఆమెకు వస్తున్న మద్దతు కూడా వెనక్కి వెళ్లిపోయింది. దాంతో శ్రీరెడ్డి కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడా కనిపించకుండా పోయింది. కొంత విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె దర్శకుడు తేజ మీద సంచలన ఆరోపణలు చేసింది. సురేష్ బాబు కుటుంబం తరఫున తేజ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అభిరామ్ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది.తాను ఫిలిం ఛాంబర్ ముందు నిరసన చేయడానికి ముందే సురేష్ బాబు కుటుంబం రాజీ ప్రయత్నాలు చేసిందని ఆమె వెల్లడించింది.
Image result for sri reddy ram gopal varma
దర్శకుడు తేజ ద్వారా తనకు రెండు సినిమాలు బిస్కెట్ల మాదిరి పడేశారని శ్రీరెడ్డి అంది. ‘‘వాళ్లు పెద్ద వాళ్లు..  కోర్టుకు వెళ్లినా ఇదే జరుగుతుంది. ఇంత హడావిడి ఎందుకు? డబ్బు తీసుకుని ఇప్పుడే తప్పుకో’’ అని తేజ తనకు సూచించాడని.. తాను చూద్దాంలే అన్నానని శ్రీరెడ్డి తెలిపింది.
Related image
రెండే సినిమాల్లో నటించిన తనకు ఇన్ని ఆస్తులుండటంపై వస్తున్న ప్రశ్నలకు శ్రీరెడ్డి సమాధానం చెప్పింది.విజయవాడలో భూముల ధరల పెరిగాక అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ లో స్థిరపడినట్లు తెలిపింది. తేజతో పాటు వర్మ కూడా తనతో ఇలాగే సెటిల్మెంట్ కోసం ప్రయత్నించాడని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: