తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాధ్ ‘బద్రి’ చిత్రంతో డైరెక్టర్ గా మారారు.  పవన్ కళ్యాన్ కి మంచి బ్రేక్ ఇచ్చిన బద్రితో పూరి కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఇడియట్, పోకిరి లాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలతో పూరి జగన్నాధ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.  పూరి వారసుడిగా ఆయన తమ్ముడు సాయి శంకర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు..కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు. ఆ తర్వాత పూరి తనయుడు ఆకాశ్ పూరి కూడా ‘ఆంధ్రపోరీ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..కానీ ఈ చిత్రం కూడా అపజయం పొందడంతో ఆకాశ్ పూర్తి స్థాయిలో నటన, ఫైట్స్, డ్యాన్స్ లో శిక్షణ తీసుకోవడానికి రెండు సంవత్సరాలు కేటాయించాడు.
Image result for mehabuba stills
తాజాగా ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ‘మెహబూబా’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇండో–పాక్‌ బోర్డర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది.1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.
Image result for mehabuba posters
తాజాగా ఆకాశ్ పూరీ మాట్లాడుతూ .. " నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడమే చాలా ఎక్కువ. అందువలన నేను పారితోషికం గురించి అడగలేదు. నేను అడగలేదు కదా అని ఆయన ఇవ్వలేదు. ఆయన పారితోషికం ఇస్తే మాత్రం తీసుకోవాలని వుంది" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.  అక్కడే ఉన్న ఆకాష్ తండ్రి పూరి జగన్నాధ్ వెంటనే కల్పించుకొని ఈ సినిమా విడుదలైన తరువాత డబ్బులొస్తే, ఆకాశ్ ఆశించే దానికంటే ఎక్కువ ఇస్తాను' అన్నారు. ఇక ఇటు తండ్రీ .. అటు కొడుకూ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: