మహానటి సావిత్రి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అందంతోనే కాదు..హావభావాలతో కూడా ఎన్నో సన్నివేశాలను రక్తి కట్టించేవారు. పాతతరం సినిమాలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రిల పేర్లే ఎక్కువగా వినిపించేవి. తెలుగు చిత్ర సీమంలో వారి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఉన్నాయని ఎంతో మంది నటీనటులు అంటారు.
ప్రస్తుతం మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక అచ్చం సావిత్రి లాగే ఉన్న కీర్తి సురేష్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సావిత్రి, కీర్తి సురేష్ ఇద్దరూ చీరకట్టులో పక్కపక్కనే ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్న ఈ ఫోటో చూసి తెగ మురిసిపోతున్నారు ప్రేక్షకులు.
నిజంగా సావిత్రి మరోసారి జన్మించి కీర్తి సురేష్ రూపంలో వచ్చిందా అన్నట్లుగా పరవశించి పోతున్నారు ప్రేక్షకులు. మే 9న ‘మహానటి’ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు పోస్టర్స్ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. ‘మహానటి’ కి సంబంధించి ప్రతీ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తుండగా.. సావిత్రి ఆడిషన్స్ కోసం తొలిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఉన్న స్టిల్, సావిత్రిగా ఆన్ స్క్రీన్ కీర్తిసురేష్ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
ఇక సావిత్రి, కిర్తి సురేష్ కట్టు.. బొట్టు అన్నీ ఒకేలా ఉన్నాయి. దీంతో రెండున్నర గంటలపాటు తెరపై నిజమైన సావిత్రియే దర్శనమివ్వబోతోంది.. అందరం సిద్ధంగా ఉందాం అని చర్చించుకుంటున్నారు ఈ పిక్ అందరినీ ఆకర్శిస్తుంది.