అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించిన ‘మహానటి’ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  ఇక కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు..టాలీవుడ్ సెలబ్రెటీలే కాదు నెటిజన్లు కూడా అచ్చం సావిత్రిలా కనిపిస్తుందని..అలాగే నటించిందని ఆమెను పొగడ్తలతో ముంచేశారు.
Image result for mahanati new posters
మహానటి చిత్రం అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. లోతుగా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ అశ్విన్ కు నలువైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.  ‘మహానటి’ మొదటి షో చూసిన రాజమౌళి, రాఘవేంద్రరావు దర్శకుడు నాగ్ అశ్విన్ ని, కీర్తి సురేష్, దుల్కన్ సల్మాన్ ని గొప్పగా పొగిడారు.  ఇక రాంచరణ్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ అద్భుత విజయం సాధించి ఈ సంవత్సరం ద బెస్ట్ చిత్రంగా నిలిచింది.
Image result for mahanati new posters
ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన రంగస్థలం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.  ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ని ‘మహానటి ’ చూసిన తర్వాత ఆశ్చర్యకరమైన అనుభూతి ఎదురైందట. తాజాగా తన అనుభూతిని మహానటి దర్శకుడు నాగ అశ్విన్ కు ఓ సందేశాన్ని సుకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సుకుమార్. సుకుమార్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ సందేశం అందరిని ఆకట్టుకుంటోంది.
Image result for mahanati new posters
ప్రియమైన అశ్విన్ అంటూ మొదలు పెట్టిన సుక్కు మహానటి చూసాక తనకు ఎదురైన అనుభవం గురించి వివరించాడు.  తాను మహానటి చిత్రాన్ని చూసి వచ్చిన తర్వాత నాగ అశ్విన్ తో మాట్లాడాలని అతడి ఫోన్ నెంబర్ కోసం ట్రై చేస్తున్నా. ఇంతలో ఓ మహిళ వచ్చి నువ్వు డైరెక్టరా బాబు అని అడిగింది. అవునన్నాను.
Image result for mahanati new posters
వెంటనే నన్ను గట్టిగా పట్టుకుని ఎంతబాగా చూపించావు బాబు మా సావిత్రమ్మని అని ఏడ్చేసింది. ఆ సంఘటనతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి..నేను నాగ అశ్విన్ కాదని చెప్పలేకపోయా. ఆవిడ ప్రేమనంతా నేనే తీసుకున్నా. కొన్ని క్షణాల పాటు నేనే నాగ అశ్విన్ గా మారిపోయాయి. ఇంతకంటే ఈ చిత్రం గురించి ఏం చెప్తాను.. అంటూ సుకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: