తెలుగు ఇండస్ట్రీలో అందాల తారగా ఒక్క వెలుగు వెలిగిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం రిలీజ్ అయ్యింది.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా..జెమినీ గణేషన్ పాత్రల్లో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కన్ సల్మాన్ నటించారు. ఈ చిత్రంలో అందాల భామ సమంత జర్నలిస్ట్ గా నటించగా..దేవరకొండ విజయ్ ఫోటో గ్రఫర్ గా నటించారు.  ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. 
Image result for mahanati movie
మ‌హాన‌టి మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ త‌న త‌దుప‌రి మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయ‌నున్నాడు..ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించాడు. ఇండస్ట్రీలో  ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తో చిరంజీవికి ఎంతో అనుబంధం వుంది. ఆ కారణంగానే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ‘మహానటి’ సినిమా ప్రమోషన్స్ లోను చిరంజీవి భాగమయ్యారు.
Image result for mahanati movie
ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తాను ఒక సినిమా చేయనున్నట్టు చిరంజీవి చెప్పారు. చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పగా .. ఈ సినిమా వైజయంతీ బ్యానర్లో వుంటుందనే విషయాన్ని అశ్వనీదత్ స్పష్టం చేశారు.
Image result for saira narasimha reddy
కాకపోతే ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందన్న విషయం త్వరలో తెలియనుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  కాగా, దీంతో సైరా త‌ర్వాత నాగ్ అశ్విన్ తో మూవీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: