సినీ నటి, దర్శకురాలు జీవితారాజశేఖర్‌, హేతువాది బాబుగోగినేనితో సహా పలువురు సినీ నటులు, ఆర్టిస్టులు, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, సోషల్‌ మీడియాలపై (మొత్తం 28 మంది) నటి శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్న నటి శ్రీరెడ్డి, మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి, ఏకంగా 28మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏసీపీ అశోక్ చక్రవర్తికి వినతిపత్రం అందజేసింది. ఇదే వినతిపత్రంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై కూడా ఆమె విరుచుకుపడింది.

సోషల్ మీడియాలో తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనను ఫేస్ బుక్, వాట్సాప్ లో ఇబ్బందులకు గురిచేస్తున్న పవన్ కు చెందిన అలాంటి కొన్ని ఫ్యాన్ గ్రూప్స్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆమె హుమయూన్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.
Image result for SRI REDDY
వీరందరూ ఇప్పటికీ తనపై వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ఏసీపీని కోరారు. ఫిర్యాదులోని అంశాలను సైబర్‌ క్రైం సహకారంతో వివరాలు సేకరించి ఆపై న్యాయ సలహాలు తీసుకుని కేసు నమోదు చేస్తామని ఏసీపీ వివరించారు. మరోవైపు నిర్మాత సురేష్ బాబుపై తన విమర్శల్ని ఇంకా ఆపలేదు శ్రీరెడ్డి.  

మరింత సమాచారం తెలుసుకోండి: