తెలుగు ప్రేక్షకులకు ‘నేను శైలజ’ చిత్రంతో అభిమాన హీరోయిన్‌గా మారిన కీర్తి సురేష్‌ టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదిగింది. తమిళంలో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తాజాగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘మహానటి’ చిత్రంలో నటించి మెప్పించింది.  ముఖ్యంగా సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరు సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌లో కీర్తి సురేష్‌ను తీసుకున్నారన్న ప్రచారం జరిగింది.
Image result for mahanati
మహానటి సక్సెస్‌ తరువాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో కీర్తి సురేష్‌ నటించనుందన్న అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కాగా,  కొన్ని సీన్స్‌లో మహానటి సావిత్రిని సైతం మించింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది అంతటి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ త్వరలో జయలలిత జీవిత చరిత్రలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కీర్తి సురేష్‌ క్లారిటీ ఇచ్చింది.
keerthi suresh clarity on jayalalitha biopic movie
ఇదే విషయాన్ని కీర్తి సురేష్‌ను ప్రశ్నించగా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను జయలలిత పాత్రలో కనిపించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు తనకు అలాంటి ఆలోచన లేదని, కొందరు శ్రీదేవి పాత్ర గురించి అడుగుతున్నారు. వీరిద్దరి జీవిత చరిత్రలో నటించడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. కొన్ని సంఘటనలు యాక్సిడెంటల్‌గా జరుగుతాయి. అలా జరిగిందే మహానటి. అలా మళ్లీ ఎప్పుడు జరగదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: