‘బాహుబలి’ తరువాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ సెలెబ్రెటీగా రాజమౌళి మారిపోయిన తరువాత అతడు తీసే సినిమాల గురించి ఏఒక్క చిన్న న్యూస్ బయటకు లీక్ అయినా అది సంచలన వార్తగా మారిపోతోంది. ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న చరణ్ జూనియర్ ల మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ పై ఉండటంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా కూడా ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న ‘ఆర్ఆర్ ఆర్’ విషయంలో ఎవరూ ఊహించని ఒక మార్పు జరగబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. సాధారణంగా జక్కన్న తాను నిర్మించే సినిమాల సాంకేతిక నిపుణుల విషయంలో పెద్దగా మార్పులు చేయడు.
ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయువుపట్టు అయిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ అంటే రాజమౌళికి ఎంతో అభిమానం. రాజమౌళి కన్ను లాంటి వాడు సెంధిల్ కుమార్ అన్న ప్రచారం కూడ ఉంది. ‘ఈగ’ ‘బాహుబలి’ సినిమాల గ్రాఫిక్స్ వండర్స్ లో సెంధిల్ కుమార్ క్రియేటివిటీ ఆమూవీల స్థాయిని విపరీతంగా పెంచింది.
అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లో సెంథిల్ కుమార్ లేడు అన్న ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో ‘మహానటి’ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న డాని లోపెజ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమార్పుకు కారణం రాజమౌళికి సెంథిల్ కుమార్ మధ్య దూరం పెరిగిందా లేదంటే అతడికంటే డానీ చాల సమర్ధుడు అని రాజమౌళి భావించాడా అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..