తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువ సమయం తెలుగులో రాణించలేక పోయారు. కానీ బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం చాలా కాలం పాటు ఉండటమే కాదు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకూల్ తెలుగులో పవన్ కళ్యాన్, ప్రభాస్ సరసన తప్ప అందరు హీరోలతో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
తెలుగు మూవీ మేకర్లు రకుల్ ప్రీత్ సింగ్ను మరిచిపోయినట్టుగా అగుపిస్తున్నారు. ఈమె తెలుగు చిత్రంల్లో కనిపించడం బాగా తగ్గిపోయింది. చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే తమిళంలో మాత్రం రెండు చిత్రంలు చేస్తోంది. అవి సూర్య, కార్తీ చిత్రాలు కావడంతో ఈమె వాటితో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఈ భామ.. సైజ్ జీరోలో దర్శనమిచ్చింది. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపించింది రకుల్.
ఇలా ఫిట్గా కనిపించడం ఓకే కానీ, ఇదే సమయంలో రకుల్లో గ్లామర్ తగ్గిందేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. తెలుగులో ఒక దశలో టాప్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్కు అనూహ్యంగా ఇప్పుడు టాలీవుడ్లో ఒక్క అవకాశం కూడా రాకుండా పోవడం విచిత్రమే. ఇదిలా ఉంటే.. హిందీలో కూడా తన ప్రయత్నాలు చేస్తున్న ఈ పంజాబీ భామ తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద దర్శనమిచ్చింది. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడడం కోసం కొవ్వును పూర్తిగా కరిగించేసుకోవడం.. క్యూట్నెస్ను కూడా కొంత దూరం చేసినట్టుగా ఉంది.