తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది  షికాగో సెక్స్ రాకెట్.   కొంత కాలంగా తెలుగు నటీమణులను అమెరికా రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వారితో వ్యభిచారం చేయించి అడ్డగోలుగా డబ్బు సంపాదించిన  ఇద్దరు భారతీయ దంపతులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. టాలివుడ్ లో....సినిమాలకు కో-ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్న..కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తితో పాటుగా అతని భార్య చంద్రని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికాగో డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఈ కేసు నడుస్తోంది.

ఐదుగురు హీరోయిన్ల‌కు ఈ ఉదంతంతో సంబంధం ఉంద‌ని వార్త‌లు రావ‌డం వివాదాస్ప‌దంగా మారింది. తెలుగు దంపతులు ఈ సెక్స్ రాకెట్‌కు మూల కార‌కులు అనే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.   సినిమాలపై తనకున్న మోజుతో ప్రొడక్షన్ బాయ్ గా పరిశ్రమలో కాలుపెట్టి, పలువురి వద్ద పనిచేస్తూ, అంచెలంచెలుగా సహ నిర్మాత స్థాయికి ఎదిగిని కిషన్ అక్రమసంపాదన అంతే లేకుండా పోయిందని పోలీసులు అంటున్నారు. 
Image result for tollywood sex racket
తాజాగా అమెరికాలో సెక్స్ రాకెట్ పై తెలుగు సినీ తారలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు.  తాజాగా ఈ సెక్స్ రాకెట్ గురించి యాంక‌ర్ అన‌సూయ స్పందించింది.గ‌తంలో త‌న‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పింది. `నేను చాలా రోజులుగా అమెరికా వెళ్ల‌లేదు. 2014లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌తో క‌లిసి ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాను.
Image result for tollywood sex racket
ఆ త‌ర్వాత 2016లో ఓ వ్య‌క్తి నాకు ఫోన్ చేసి అమెరికాలో తెలుగు అసోషియేష‌న్ నిర్వ‌హించే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని అడిగాడు.   అయితే అతను మాట్లాడే పద్దతి నాకు నచ్చకపోవడంతో..నేను తిరస్కరించానని..కానీ వారు మాత్రం నా ఫోటోను పోస్టర్ లో వేసి  ప్ర‌చారం చేసుకున్నార‌`ని అన‌సూయ చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: