ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ చిత్రాలు బాగానే వస్తున్నాయి.  కథ బాగుంటే చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.  కామెడీ చిత్రాలకు పెద్ద పీట వేసే మారుతి దర్శకత్వంలో  అక్కినేని నాగ చైతన్య,  అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న  'శైలజా రెడ్డి అల్లుడు' షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తుంది.  ఇందుకోసం ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందట. అంతే కాదు ఈ పాత్రనే చిత్రానికి హైలెట్ కాబోతుందట.   
Image result for naga chaitanya anu emmanuel
గతంలో అక్కినేని నాగార్జున కుటుంబ తరహా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.  ఇప్పుడు నాగ చైతన్య వంతు వచ్చింది.  అయితే ఈ సినిమా మరో అల్లరి అల్లుడు టైప్ లో ఉండబోతుందా అని అనుకుంటున్నారు.  ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూలై 1వ తేదీన టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నాడు.

చైతూ సింగిల్ స్టిల్ తోనే ఈ ఫస్టులుక్ పోస్టర్ వుండనుందనే టాక్ వినిపిస్తోంది.  ఇక ఈ చిత్రం జూలై 25వ తేదీ నాటికి పాటలతో సహా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: