మాటల మాంత్రికుడు త్రివిక్రం తన పెన్ పవర్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. పవన్, బన్ని, మహేష్ లతో సినిమాలు తీసిన త్రివిక్రం ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఫ్యాక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్కే అభిమానులను అలరించింది.


ఇదిలా ఉంటే ఓ కమెడియన్ త్రివిక్రం మీద అనవసరపు కామెంట్స్ చేశాడు. అతనెవరో కాదు జబర్దస్త్ నుండి సిల్వర్ స్క్రీన్ కు ప్రమోట్ అయిన షకలక శంకర్. కమెడియన్ గా కొన్ని సినిమాలు చేశాడో లేదో అతను కూడా హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. షకలక శంకర్ నటించిన శంభో శంకర ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షకలక శంకర్ తానో కథ పట్టుకుని త్రివిక్రం, అల్లు శిరీష్, దిల్ రాజు, రవితేజ దగ్గరకు వెళ్లి కలిశానని.. వారిలో రవితేజ తప్ప మిగతా వారంతా సరిగా ఎంకరేజ్ చేయలేదని అన్నాడు షకలక శంకర్. త్రివిక్రం డైరక్షన్ లో అఆ సినిమాలో నటించాడు షకలక శంకర్.


కమెడియన్ గా చేసి హీరోగా అతని ప్రయత్నాన్ని ఎందుకు ఎంకరేట్జ్ చేయలేకపోయారు అన్నది పక్కన పెడితే. తన సినిమా ప్రమోషన్స్ పై ప్రేక్షకుల దృష్టి పడేందుకే ఇలాంటి శంకర్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. శంకర్ మాత్రం ఈ సినిమాతో పాటుగా మరో సినిమా లైన్ లో పెట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: