ఈ మద్య కాలంలో భారత దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగా పెరిగిందో ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇక ఎయిర్ టేల్ 4 జి యాడ్ అనగానే ఓ అమ్మాయి దర్శనం ఇస్తుంది. బెబీ కటింగ్ తో కనిపించే ఆ కుర్రది ఎంతో చలాకీగా కనిపిస్తూ..అందరికీ ఆకర్శించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా! షషా చెత్రి. ఇప్పుడు ఆ అమ్మాయికి హీరోయిన్గా అవకాశం దక్కింది.
అది కూడా ఓ తెలుగు సినిమాలోనే కావడం విశేషం. అవును.. ఎయిర్టెల్ అమ్మాయి, 4జీ గర్ల్ అంటూ గుర్తింపు పొందిన షషా చెత్రి త్వరలోనే ఓ తెలుగు సినిమాలో కథానాయికగా నటించనుంది. అడవి కిరణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో షషా చెత్రి నటించడానికి కారణం ఆ కథపై నమ్మకమే అట. బాలీవుడ్ లో చాన్సులు వచ్చినా పట్టించుకోకుడా భాష కాని భాష అయిన తెలుగు లో నటించడానికి ఒప్పుకోవడం కూడా ప్రత్యేకత ఉందట.
చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సక్సెస్ సాధిస్తే..అటోమెటిక్ గా తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి పాపురారిటీ తెచ్చుకోవడం కూడా ఓ ప్లస్ పాయింట్. అంతేకాదు.. తన తొలి చిత్రం కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నట్లు చెప్పింది. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో ఇష్టమని షషా తెలిపింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తనకు ఇష్టమేనని చెప్పింది. టాలీవుడ్లో చాలా మంది ప్రతిభ ఉన్న నటులున్నారని పేర్కొంది. తాను హీరోయిన్ గా రావడానికి ఎయిర్టెల్ యాడ్ ఎంతగానో ఉపయోగపడిందని షషా చెప్పుకొచ్చింది. ఆ ప్రకటనకు సంబంధించిన క్యాంపెయిన్ చాలా ఎక్కువ కాలం సాగిందని, ఈ కారణంగా దేశవ్యాప్తంగా తనను అందరూ గుర్తు పెట్టుకున్నారని తెలిపింది.