త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈ ఇయర్ రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటని చెప్పొచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు.


ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్దెతో పాటుగా ఈషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ భారీ రేంజ్ లో జరుగుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమా కూడా హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.


ఇక ఈ సినిమా ఆంధ్రాలో భారీ బిజినెస్ చేస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అరవింద సమేత 40 కోట్ల బిజినెస్ చేసిందట. స్టార్ సినిమాలకు ఆంధ్రాలో 40 కోట్లు రేటు ఫిక్స్ చేశారు. మహేష్, ఎన్.టి.ఆర్ ఈ రేంజ్ కు వెళ్లినా రాం చరణ్ ఇంకా ఆ మార్క్ అందుకోలేదు.


ఈ లెక్కన నైజాం 20 కోట్లు, సీడెడ్ 12 కోట్లు ఎలా లేదన్నా అరవింద సమేత తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 72 కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. ఓవర్సీస్ లెక్కలను కలిపి 100 కోట్లు టచ్ చేయొచ్చని అంచనా మరి త్రివిక్రం, తారక్ మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: