తెలుగు ఇండస్ట్రీలో  ఇప్పటి వరకు బయోపిక్  చిత్రాలు రాలేదు..ఎందుకంటే ఒక సెలబ్రెటీ బయోపిక్ తీయాలంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని అంశాలు తెరకెక్కించాల్సి ఉంటుంది.   ముఖ్యంగా సినీ తారలపై బయోపిక్ సినిమాలు తీయాలంటే ఎంతో ఘడ్స్ ఉండాలని భావించే వారు.  అయితే తొలిసారిగా అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా తెరకెక్కించారు.  

Related image

ఇప్పుడు టాలీవుడ్ లో మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా తీస్తున్నారు. ఈ చిత్రానికి మొదట తేజ అనుకున్నా తర్వాత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్య బాలీవుడ్ లో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ చిత్రం కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు తెరపై  రాజకీయ నేపథ్యంలో బయోపిక్ తీసేందుకు దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. త్వరలో కేసీఆర్ బయోపిక్ కూడా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Image result for ntr bio pic

రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు టీజర్ కూడా రాబోతోంది. వైఎస్ జయంతి అయిన జూలై 8న కానీ, లేదా ముందుగా 7న కానీ టీజర్ విడుదల చేసే ఏర్పాట్లలో వున్నారు నిర్మాతలు. రంగస్థలం సినిమాతో మాంచి పేరు తెచ్చుకున్న ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ యాత్ర సినిమా కోసం సారథి స్టూడియోలో మాంచి సెట్ వేసారు. 

Related image

ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.  యాత్ర సినిమాలో పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తున్నారు.  ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా సత్య సూరియన్ (ఖాకీ, మాయ సినిమాల ఫేమ్), మ్యూజిక్ డైరక్టర్ గా కే (ఘాజీ, ఆనందో బ్రహ్మ) పని చేస్తున్నారు.

సినిమాకు టెక్నికల్ టీమ్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు.  ఈ సినిమా త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో దించేందుకు దర్శక, నిర్మాతలు పూర్తి సన్నాహంతో ఉన్నారు.  వైఎస్ జయంతి అయిన జూలై 8న కానీ, లేదా ముందుగా 7న కానీ టీజర్ విడుదల చేసే ఏర్పాట్లలో వున్నారు నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: