త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఘోర అవమానాన్ని మిగిల్చిన ‘అజ్ఞాతవాసి’ అతడికే కాకుండా పవన్ అభిమానులకు కూడ ఒక పీడకల. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ కి అనుసరణగా రూపొందిన ఈమూవీ ఘోర పరాజయం ఈసంవత్సరపు అతిభయకంకర ఫ్లాపులలో ఒకటిగా మారింది. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ప్రభాస్ అభిమానులకు కూడ త్వరలో ఎదుర్వబోతోందా అన్న అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 
A Saaho Update. Prabhas To Tackle Two Villains In The Film
దీనికి కారణం ఈమూవీ దర్శకుడు సుజిత్ అని అంటున్నారు. ఈయంగ్ డైరెక్టర్ ‘సాహో’ సినిమా కోసం రాసుకున్న కథ కూడ కొద్ది మేరకు ‘లార్గో వించ్’ అనుసరణగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల అయిన తరువాత తమ ‘సాహో’ పై కూడ ‘లార్గో వించ్’ ప్రభావం ఉంది అని గుర్తించిన ఈమూవీ దర్శక నిర్మాతలు ఖంగారుగా ఈమూవీ కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 
Keep this smile Prabhas becauz whole wprld depends upon it.
ఆతరువాత ఈసినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను దుబాయ్ లో తీయడమే కాకుండా అత్యంత భారీ స్థాయిలో ఈమూవీ యాక్షన్ సీన్స్ కోసం ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. ‘సాహో’ సినిమాకు సంబంధించిన మరొక భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో తీయడానికి కౌంట్ డౌన్ మొదలైనా ఈమోవీ కథ విషయంలో వెంటాడుతున్న ‘అజ్ఞాతవాసి’ భయాలు ఇంకా ఈమూవీ దర్శక నిర్మాతలను వెంటాడుతూనే ఉన్నట్లు టాక్. దీనితో మరొక ప్రత్యేకమైన రైటర్స్ టీమ్ ను ఏర్పాటు చేసి ‘సాహో’ కథ పై ఎక్కడా ‘లార్గో వించ్’ ఛాయలు కనపడనీయకుండా ఒకటికి పదిసార్లు ఈసినిమా స్క్రిప్ట్ పై లోతైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  
Prabhas
కొంతకాలం క్రితం యంగ్ హీరో ఆది నటించిన ‘సుకుమారుడు’ సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యాక ఆమూవీ కథ ఒకప్పటి నాగార్జున ‘గ్రీకువీరుడు’ కథను పోలి ఉందని గ్రహించి ‘సుకుమారుడు’ మూవీ టీమ్ విపరీతమైన టెన్షన్ పడి ఎన్నో మార్పులు చేర్పులు చేసారు. అయితే ఆమూవీ ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు ‘సాహో’ దర్శక నిర్మాతలు కూడ టెన్షన్ లో ఈమూవీ కథ విషయంలో ఎన్ని మార్పులుచేర్పులు చేసినా ఎక్కడో అక్కడ ‘సాహో’ ‘అజ్ఞాతవాసి’ ఛాయలు వెంటాడుతాయా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: