తెలుగు ఇండస్ట్రీలో‘తొలివలపు’ చిత్రంతో హీరోగా వచ్చినా..పెద్ద సక్సెస్ అందుకోక పోవడంతో విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపిచంద్ మూడు చిత్రాల్లో నటించాడు. తర్వాత హీరోగా మారి యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. మొదట్లో మంచి విజయాలు అందుకున్న గోపిచంద్ ‘లౌక్యం’ చిత్రం తర్వాత వరుస ఫ్లాపులు చవి చూశాడు. గోపిచంద్ చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ అండ్ మెసెజ్ ఓరియెంటెడ్గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. గత వారం రిలీజ్ అయిన చిత్రాలు పెద్దగా టాక్ రాకపోవడంతో.. గోపీచంద్ పంతం చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ట్రైలర్తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్ను, 3 కోట్ల గ్రాస్ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిచగా, కేకే రాధామోహన్ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు.
‘పంతం’ఏరియా వైజ్ కలెక్షన్లు :
నైజాం – 1,12,00,000
సీడెడ్ – 47,00,000
నెల్లూరు – 12,00,000
గుంటూరు – 33,00,000
కృష్ణ – 15,77,125
వెస్ట్ గోదావరి – 16,35,976
ఈస్ట్ గోదావరి – 20,92,000
ఉత్తరాంధ్ర – 34,79,085
....................................
ఏపీ, టీస్ షేర్ – 2.92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 20,00,000
ఓవర్సీస్ – 10,00,000
.....................................
వరల్డ్ వైడ్ షేర్ 3.22 కోట్లు,
.................................
గ్రాస్ 5.2 కోట్లు