బాలీవుడ్ లో సంచలన హీరో సంజయ్ దత్ తాజా చిత్రం ‘ప్రస్థానం’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 2010లో రాజకీయ నేపథ్యం గల కథతో దేవ కట్టా తీసిన చిత్రం ‘ప్రస్థానం’. ఈ చిత్రం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి తెగ నచ్చిందట..అందుకే ఈ చిత్రం రీమేక్ చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం గతంలోనే రావాల్సి ఉన్నా..సంజూ జైలుకు వెళ్లడంతో వాయిదా పడినట్లు సమాచారం. కాగా దాదాపు ఐదేళ్లు వెయిట్ చేసిన దేవరకట్టా ఈ చిత్రానికి సంజూ హీరోగా దర్శకత్వం వహించబోతున్నాడు.
దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను - ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రామాయణ - మహాభారతాలు ఊరికే జరగలేవు అంటూ ఓ భారీ డైలాగును సంజయ్ చెప్పి పోస్టర్ పై అంచనాలు పెంచేశారు. దేవాకట్టా తెలుగులో తీసిన ఈ సినిమాలో ఎన్నో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సంజయ్ దత్ ఫస్ట్ లుక్ తోనే భారీ డైలాగ్ చెప్పడం చూస్తుంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
హిందీ ‘ప్రస్థానం’ లో సాయికుమార్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. సంజు భార్య పాత్రను మనీషా కొయిరాలను పోషిస్తున్నారు. ఇక విలన్ గా జాకీ ష్రాఫ్ ను ఎంపిక చేశారు. తెలుగులో హీరోగా చేసిన శర్వానంద్ పాత్రకు అలీ ఫజల్ ను తీసుకున్నారు. సంజయ్ దత్ నిర్మాతగా మారి సొంత బ్యానర్ పై ఈ సినిమా తీస్తున్నాడు.