తెలుగు ఇండస్ట్రీలో  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో  ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రానికి మొదట తేజ దర్శకత్వం అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడు. ఇక  తేజ ప్లేస్ లో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ జీవితంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో గొప్ప గుర్తింపు ఉంది.  అందుకోసం ఎన్టీఆర్ బయోపిక్ లో దాదాపు 60 గెటప్ లు వేయాలని, ఏదేదో చేయాలని అనుకున్నారు బాలయ్య.   
Image result for ntr biopic
కానీ ఈ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ చిత్రం ప్రభావం ఎన్టీఆర్ బయోపిక్ పై  బాగానే పడినట్లు తెలుస్తుంది. మహానటి సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే విధంగా తెరకెక్కించారు.  ఈ నేపథ్యంలో రంగంలోకి దర్శకుడు క్రిష్ వచ్చి మొత్తం మార్చేసారు ఎన్టీఆర్ ను అభిమానించిన మునపటి రెండుతరాలు ఇళ్ల నుంచి థియేటర్ కు వచ్చి సినిమాను చూడాలనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకుంటున్నారు. 
Image result for ntr biopic
ఇక చంద్రబాబు పాత్రలో రానా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా  సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ బయోపిక్ లో నిర్మాత బిఎ సుబ్బారావుగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్-ఎఎన్నార్ లు నటించిన పల్లెటూరి పిల్ల సినిమా నిర్మాత ఆయనే. ఎన్టీఆర్ కు ఇది మూడో సినిమా. మనదేశం, షావుకారు తరువాత ఈ సినిమా చేసారు. అందుకే బయోపిక్ లో ఆ సీన్లు పెట్టారు.  మరో ట్విస్ట్ ఏంటంటే..యంగ్ ఎన్టీఆర్ గా కూడా బాలయ్యే కనిపిస్తారని క్లారిటీ వచ్చేసింది. గతంలో ఈ పాత్రలో శర్వానంద్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ లో శర్వానంద్ లేనట్లే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: