ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ కొనసాగుతుంది. పెద్ద చిత్రాలు రిలీజ్ కాకముందే..ఆ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మాద్యమాల్లో తెగ హల్ చల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి చిత్రానికి సంబంధించిన కథ..అత్తారింటికి దారేది, కబాలి ఇలా చాలా చిత్రాలకు సంబంధించిన కథ ఇదే అంటూ ప్రచారం జరిగాయి. అయితే కొన్ని సార్లు ఆ కల్పితక కథలు కూడా దగ్గరి పోలికలు ఉండటం విశేషం. తాజాగా తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయిశ్రీనివాస్ అల్లడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.
తర్వాత వచ్చిన స్పీడున్నోడు పెద్దగా సక్సెస్ కాకపోయినా..జయ జానకీ నాయక మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డె నటించిన ‘సాక్ష్యం’ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా సాక్ష్యం సినిమాపై కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటున్నారు. ఇక కథ విషయానికి వస్తే..పంచభూతాల కథ అని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో వీడియో గేమ్ ల చుట్టే కథ తిరుగుతుందనే విషయం లీక్ అయ్యింది.
బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో గేముల డెవలపర్ గా కనిపిస్తాడట.. తాను తయారు చేసిన గేమ్ లా ద్వారా.. శత్రువులు కూడా అంతమైపోతారట. అలా వీడియో గేములకు - విలన్లకు లింకు పెట్టి ఈ కథను అద్భుతంగా తీశాడట శ్రీవాస్. గతంలో షారుఖ్ ఖాన్ ‘రావన్’ చిత్రం గుర్తుందా.. వీడియో గేమ్ ల నుంచి ఉద్భవించిన రోబో అందరినీ చంపేస్తుండడం ఆ సినిమా కాన్సెప్ట్.. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా వస్తోంది.
అయితే ఈ విషయంపై అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ వినూత్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి