తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’చిత్రాన్ని తెరకెక్కించారు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు జనాలు నీరాజనాలు పరలికారు.  ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో షరవేగంగా జరుపుకుంటుంది.   
Image result for mahanati
అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో  బాలయ్య కాకుండా ఎవరెవరు కీలక పాత్రల్లో నటించబోతున్నారు అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా రానా సావిత్రిగా కీర్తి సురేష్ శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా హంగామా నడిచింది. తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ దర్శకులు క్రిష్, చిత్ర యూనిట్  త్వరలోనే ఎన్టీఆర్ లో ఎవరెవరు ఏ పాత్రలు చేయబోతున్నారు అనే వివరాలు ప్రకటిస్తామని చెబుతున్నారు. అధికారికంగా తాము చెప్పకుండా బయట వస్తున్నావని అవాస్తవాలని తేల్చి చెప్పారు. 
Image result for ntr biopic
కాకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కన్ఫామ్ అని తెలుస్తుంది..ఎందుకంటే నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇంటికి పిలిచి గౌరవించిన బాలయ్య ఇవాళ్టి నుంచి  తనను షూటింగ్ లో భాగం చేయబోతున్నాడు. తనదే సింహ భాగంగా ముగ్గురు నిర్మాతల్లో ఒకడిగా ఈ సినిమా తీస్తున్న బాలయ్య మేకింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. 

గతంలో ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం గౌతమిపుత్రశాతకర్ణిని 84 రోజుల్లో పూర్తి చేసిన తనకు ఎన్టీఆర్ కోసం ఇచ్చిన ఆరు నెలల సమయం సరిపోతుందని అన్నాడట. మరి ఇంకా కీలకమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటికి ఎవరెవరు వస్తారో అని అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేమికులకు కూడా సస్పెన్స్ గానే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: