2019 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవ్వాలని ప్రయత్నిస్తున్న మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ పై సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ ను ఖర్చుపెట్టబోతున్నారు. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభం అయినా ఈమూవీ షూటింగ్ రకరకాల కారణాలతో వాయిదా పడుతున్న నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 30 శాతం మాత్రమే పూర్తి అయింది అని అంటున్నారు. 
First look of Sye Raa Narayana Reddy
ఇలాంటి పరిస్థుతులలో ఈనెల 23 నుండి జరగవలసిన ‘సైరా’ షూటింగ్ కు వరుణ దేవుడు అడ్డంకిగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈమూవీ యూనిట్ హైదరాబాద్ లోని కోకాపేట్ ప్రాంతంలో ఒక సెట్ వేసినట్లు సమాచారం. 
Sye Raa film poster.jpg
అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలు ఆ సెట్ ను పాడుచేసాయి అని తెలుస్తోంది. వానలు తగ్గినప్పటికీ ఈ సెట్ ను బాగుచేయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో వచ్చే వారం నుండి ప్రారంభం కావలసి ఉన్న ఈమూవీ షూటింగ్ మరొకసారి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. 
Chiranjeevi and Ram Charan
దీనికితోడు ఈసినిమాలో నటిస్తున్న నటీనటులు అంతా వివిధ భాషలకు చెందిన ప్రముఖ ఆర్టిస్టులు కావడంతో వీరందరి డేట్స్ విషయంలో కూడ సమస్యలు వస్తున్నట్లు సమాచారం. ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్ వర్క్స్ చేయవలసి ఉన్న పరిస్థుతులలో ఆ పనుల కోసమే సుమారు 6నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనితో ఈమూవీ ఎప్పటికి విడుదల అవుతుంది అన్న విషయమై చిరంజీవితోపాటు చరణ్ కు కూడ అయోమయం ఏర్పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: