తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క మొదట్లో గ్లామర్ కే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చింది. ‘అరుంధతి’ చిత్రం తర్వాత ఎక్కువ శాతం నటనకు ప్రాదాన్యత ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాక్షరి,రుద్రమదేవి, సైజ్ జీరో ఈ మద్య భాగమతి లాంటి చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.
అయితే భాగమతి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డెబ్యూ డైరెక్టర్ హేమంత్… హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుష్క కి వినిపించగా… కథ నచ్చి ఈ సినిమాని అనుష్క ఒకే చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం హీరోల పక్కన నటించే కన్నా ఇలా లేడి ఒరింటెడ్ పాత్రలనే ఒప్పుకోవాలని అనుష్క ఆలోచనగా చెబుతున్నారు. గతంలో అయితే హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ పాత్రలు అదరగొట్టేది.
ఇక ఇప్పుడు మాత్రం అనుష్క నే బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఎంతమంది హీరోల సరసన అవకాశం వచ్చినా.. అనుష్క ఒప్పుకోలేదని.. కానీ ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడంతోనే అనుష్క ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది. మరి నిజంగానే అనుష్క గనక ఈ సినిమా చేస్తే… ఆమెకి స్టార్ హీరోల పక్కన నటించే ఇంట్రెస్ట్ తగ్గిందా…లేదంటే అనుష్కకి అవకాశాలు రాక అలా సినిమాలు చెయ్యడం లేదా అనేది కూడా క్లారిటీ రావాలి.