ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు మరింత వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ,వైసీసీ, జనసేన మద్య మాటల యుద్దాలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని టార్గెట్ చేసుకొని జగన్, పవన్ లు నానా మాటలు అంటూ వచ్చారు. ఈ మద్య వైఎస్ జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని పట్టుకొని దారుణమైన మాటలు మాట్లాడారు. కారును మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడని..పవన్ నిత్య పెళ్లికొడుకు అని వ్యాఖ్యానించారు జగన్.
దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాన్ సైతం లక్షకోట్లు తిన్న దొంగలు..జైళ్లో చిప్పకూడు తిన్న వారు అంటే నేను పట్టించుకోను అని అన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్ వైసీపీ నేత జగన్ ని ఉతికి ఆరేస్తున్నారు. తాజాగా వైసీపీ చీఫ్ జగన్తో నటి, మోడల్ అలేఖ్య ఏంజెల్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జగన్ తీవ్రవ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ఫొటో సోషల్ మీడియాకెక్కింది. హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న జగన్ ఇతరులపై వ్యాఖ్యలు చేయడానికి అనర్హుడు అంటూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. గతేడాది ఫిబ్రవరి 18న ఓ సీడీ లాంచ్ సందర్భంగా లోటస్పాండ్లోని జగన్ నివాసంలో ఆయనతో తీసుకున్న సెల్ఫీ ఇదని, ఈ ఫొటో పట్టుకుని రాద్ధాంతం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది.
జగన్ను ఇరుకున పెట్టేందుకు తన ఫొటోను వాడుకోవడం తగదని పవన్ అభిమానులకు హితవు పలికింది. జగన్ తండ్రిలాంటివాడని, పెద్దన్నయ్య లాంటివాడని పేర్కొన్న అలేఖ్య సీడీ లాంచింగ్కు తన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారని పేర్కొంది. మిగతా వారితో కలిసి జగన్ను రిక్వెస్ట్ చేసి మరీ సెల్ఫీ తీసుకున్నామని వివరించింది. తాను కూడా పవన్ అభిమానినేనని, ఆయన మానవత్వం గల మనిషి అని పేర్కొంది. ఓ నటుడుగా ఆయన తనకు ఆదర్శమని, అటువంటి వారి గౌరవాన్ని ఇటువంటి పోస్టులు పెట్టి దెబ్బతీయవద్దని పవన్ అభిమానులకు సూచించింది. తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన అలేఖ్య.. ఇది చదివాకైనా ఆ పోస్టులు తొలగిస్తారని భావిస్తున్నట్టు చెప్పింది.