తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన రవితేజ ‘ఇడియట్’చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ..మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్నాడు. పవర్ చిత్రం తర్వాత రవితేజ వరుసగా అపజయాలు చవిచూశాడు. దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తిరిగి ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేట టిక్కెట్టు రెండూ డిజాస్టర్ అయ్యాయి. తాజాగా ‘దుబాయ్ శీను’లాంటి మాస్ ఎటిమెంట్స్ చిత్రాన్ని అందించిన శ్రీనువైట్ల తో మరోసారి జగకట్టబోతున్న విషయం తెలిసిందే. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ‘అమర్ అక్బర్..అంటోని’సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీను వైట్ల-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై వీరిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..ఎందుకంటే వీరిద్దరికి ఓ మంచి సక్సెస్ ఎంతో అవసరం.