బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా శరత్ కటారియా దర్శకత్వం తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూయీ ధాగా: మేడ్‌ ఇన్‌ ఇండియా’. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్  విడుదల చేసింది.  యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మౌజీ, మ‌మ‌త పాత్ర‌ల‌లో వ‌రుణ్‌, అనుష్క న‌టిస్తున్నారు. తాజాగా  ట్రైలర్‌ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.

Varun Dhawan and Anushka Sharma film will inspire you to become an entrepreneur

వరుణ్ ధావన్‌తో అనుష్క నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంలోని పాత్ర‌ల‌కు అనుగుణంగా మారేందుకు వీరిద్ద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని బాలీవుడ్ వ‌ర్గాల చెబుతున్నాయి.  అనుష్క‌ డీ గ్లామ‌ర్ లుక్ లో చాలా అందంగా క‌నిపించింది. కేంద్ర సర్కార్ ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారని తెలుస్తోంది. 

Image result for సూయీ ధాగా: మేడ్‌ ఇన్‌ ఇండియా

ఇక  చిత్రీకరణలో సమయంలో తీసిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ తో మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. మధ్యప్రదేశ్‌లోని ఛాందేరి, ఢిల్లీ, ముంబయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.  కనుమరుగైపోతున్న భారతీయ సంప్రదాయ దుస్తులను మళ్లీ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటాడు. ఇందుకు మమతా కూడా సాయపడుతుంది. ఇందులో మౌజీ, మమతాల పాత్రల్లో వరుణ్, అనుష్కలు ఇమిడిపోయారు. ట్రైలర్‌లో అనుష్క అమాయకత్వం భావోద్వేగానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: