బాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్‌టిఆర్’. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుండగా.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.  హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నాడు.

ఇక శ్రీదేవి పాత్రలో రకుల్ ను తీసుకున్నారు .. ఈ విషయాన్ని రకుల్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక ఎస్వీఆర్ పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించబోతున్నారు.  ఎన్టీఆర్ తనయుడు దివంగత నటుడు హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాన్ రామ్ నటించబోతున్నట్లు సమాచారం.  తాజాగా ఎన్టీఆర్ తో ఎక్కువ నటించిన హీరోయిన్లలో జయప్రద కూడా ఒకరు.  ఇక జయప్రద పాత్రలో అందాల భామ రాశీఖన్నా నటించబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

తాజాగా ఈ విషయంపై స్పందించిన రాశీఖన్నా..తను ఈ చిత్రంలో ఇంకా భాగం అవ్వలేదని తెలిపింది. యన్‌టిఆర్ చిత్రం కోసం ఎవరూ తనను సంప్రదించలేదని, మీలాగే నాకు కూడా ఇది ఓ వార్త అంటూ పేర్కొంది. న నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ జోడీగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: