తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణిత నటించారు.  ఇక అత్తారింటికి దారేది చిత్రంలో అత్తా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.  అత్త పాత్రలో నదియా అద్భుతంగా నటించారు.  ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నేపథ్యంలో ఇతర భాషల్లోనూ రిమేక్ చేస్తున్నారు. 

కన్నడంలో కిచ్చా సుదీప్ నటించగా అత్త పాత్రలో ‘రోజా’ఫేమ్ మధుబాల నటించింది. తాజాగా తమిళంలో అత్తారింటికి దారేది చిత్రాన్ని రిమేక్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.  హీరోగా శింబు నటిస్తున్నారు. అయితే అత్త పాత్రలో ఖుష్బు నటిస్తున్నారు.  తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం అందాల కథానాయికగా ఖుష్బూకి మంచి పేరుంది.

ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తన వయసుకి తగిన ప్రాముఖ్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తోంది.  నదియా క్రేజ్ ను పెంచేసిన ఈ పాత్రను తమిళంలో ఖుష్బూ చేస్తోంది. తన కెరియర్లోను ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఖుష్బూ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది .. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: