యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్. విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇన్నాళ్లూ అనుకున్న టైమ్కు "అరవింద సమేత" వస్తుందా రాదా అనే చిన్న టెన్షన్ అయిత ప్రేక్షకుల్లో ఉండేది. ఎందుకంటే అనుకోకుండా హరికృష్ణ చనిపోవడంతో షూటింగ్ ఆలస్యం అయింది. దాంతో ఇది విడుదల తేదీపై ప్రభావం చూపిస్తుందేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అదేమీ లేదని సాక్ష్యాలతో సహా ఇచ్చారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేసారు. ఇదివరకే ఒక్కొక్కటిగా విడుదలైన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ‘పెనివిటి’ సాంగ్కు మంచి స్పందన వస్తోంది. అక్కడక్కడా విన్న పాటల్లా అనిపించినా కూడా ఏదోలా మాయ చేసాడు థమన్. ఈ సినిమాకు పూజాహెగ్డే అందాలు బోనస్. తెలుగమ్మాయి ఇషారెబ్బా కూడా ఇందులో మరో హీరోయిన్గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన అన్ని అప్డేట్స్ నందమూరి ఫ్యాన్స్ లో ఆతృతను పెంచేశాయి. ముఖ్యంగా థమన్ బాణీలతో విడుదలైన లిరికల్ సాంగ్స్ తెగ ఆకట్టుకుంటూ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచేశాయి. ఈ రోజు (సెప్టెంబర్ 29)న మరో లిరికల్ సాంగ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రెడ్డి ఇక్కడ సూడు’ అనే ఈ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు నెట్టింట దర్శనమీయనుంది.